Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిషికేష్ నుంచి 20న విశాఖ చేర‌నున్న శారదా పీఠాధిపతి

రిషికేష్ నుంచి 20న విశాఖ చేర‌నున్న శారదా పీఠాధిపతి
విజయవాడ , శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:03 IST)
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఈనెల  20వ తేదీన విశాఖ నగరానికి చేరుకోనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత విశాఖ నగరానికి తిరిగి వస్తున్న పీఠాధిపతులకు  భక్తులు స్వాగతం పలుకుతారు. వ‌చ్చే సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు పీఠాధిపతులు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
 
స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష కోసం మే 15వ తేదీన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, వేద విద్యార్థులతో కలిసి విశాఖ నుంచి రిషికేష్ వెళ్ళారు. జూలై 24వ తేదీన  ప్రారంభమైన చాతుర్మాస్య దీక్ష ఈనెల 20వ తేదీన ముగుస్తుంది. దీక్షా సమయాన్ని తపోకాలంగా పరిగణించి వేదాంత చింతనతో గడిపారు. రిషికేష్ తో పాటు హరిద్వార్ తదితర హిమాలయ పాద ప్రాంతాల్లో సంచరించారు. నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన ప్రస్థాన త్రయ భాష్య పాఠాలను వేద విద్యార్థులకు బోధించారు.
 
విశాఖ శ్రీ శారదాపీఠం ప్రచురించదలచిన ఆధ్యాత్మిక గ్రంధాలపై పరిశోధనలు సాగించారు. 129 రోజుల తర్వాత స్వామీజీ తిరిగి విశాఖకు చేరుకుంటున్నారు. అక్టోబరు 7వ తేదీ నుంచి విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించే శ్రీ శారదా స్వరూప రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొంటారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్‌-ఆధార్‌ అనుసంధాన గడువు మరో 6 నెల‌లు పొడిగింపు