కరోనావైరస్: డేంజర్ జోన్‌గా హైదరాబాదు

Webdunia
శనివారం, 18 జులై 2020 (17:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ డేంజర్ బెల్‌ను మోగిస్తున్నది. హైదరాబాదు నగరంలో కరోనా కేసులు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో హైదరాబాదు ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారిపోయింది. కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎన్నో సూచనలను ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా నగరంలో దాదాపు 2.22 లక్షలకు పైగా టెస్టులు చేసింది.
 
వీటికి కావలసిన ర్యాపిడ్ టెస్టు కిట్లను 2 లక్షల వరకు తెచ్చి సరఫరా చేసింది. అవి సరిపోని పక్షంలో దక్షిణ కొరియా సంస్థకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల్లో కేసులు పెరగడంతో వాటిని జిల్లాలకు తరలించనున్నారు. ఒక్కో పీహెచ్‌సిలో రోజుకు వంద టెస్టులు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా ఎన్నుకున్నారు.
 
ర్యాపిడ్ టెస్టులు త్వరితంగా ఫలితాలు వస్తున్నాయని మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఐసీఎంఆర్ అనుమతి పొందిన సంస్థల నుండి ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేస్తున్నామని  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments