Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో సెల్ ఫోన్ మోగింది.. రూ.100 జరిమానా... ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (08:12 IST)
కోర్టులో నిశ్శబ్ధం తప్పనిసరి. అలాంటి కోర్టులో సెల్ ఫోన్ మోగడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది జులై 1న హనుమకొండలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 
 
ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో పాటు మొత్తం 12 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. 
 
ఈ కేసు మంగళవారం వరంగల్ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ ఫోన్ మోగింది. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి కోర్టు వాతావరణాన్ని దెబ్బతిశారంటూ స్వర్ణ ఫోన్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇంకా వంద రూపాయలు జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించి జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి తన మొబైల్ ఫోన్‌ను స్వర్ణ వెనక్కు తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments