Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో సెల్ ఫోన్ మోగింది.. రూ.100 జరిమానా... ఎక్కడ?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (08:12 IST)
కోర్టులో నిశ్శబ్ధం తప్పనిసరి. అలాంటి కోర్టులో సెల్ ఫోన్ మోగడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది జులై 1న హనుమకొండలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 
 
ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో పాటు మొత్తం 12 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. 
 
ఈ కేసు మంగళవారం వరంగల్ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ ఫోన్ మోగింది. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి కోర్టు వాతావరణాన్ని దెబ్బతిశారంటూ స్వర్ణ ఫోన్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇంకా వంద రూపాయలు జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించి జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి తన మొబైల్ ఫోన్‌ను స్వర్ణ వెనక్కు తెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments