Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు వేసుకోమన్నందుకు కత్తితో పొడిచేశాడు

Webdunia
బుధవారం, 29 జులై 2020 (18:26 IST)
కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ రాకపోవడంతో దానిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పడు ప్రజలకు సూచిస్తున్నాయి. బయటకు వెళ్లినప్పడు శానిటైజర్లు రాసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి సూచనలను ప్రభుత్వాలు పదేపదేమనకు తెలుపుతున్నాయి.
 
కానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మరికొంత మంది ఇతరులు సలహా ఇస్తే వారితో తిరుగుబాటుకు దిగుతున్నారు. కరీంనగర్‌లో ఓ యువకుడికి మరో వ్యక్తి మాస్కు ధరించుకోమని చెప్పినందుకు ఆ యువకుడు వ్యక్తిపై దాడికి దిగాడు. ఈ సంఘటన జిల్లాలోని తీగలగుట్ట పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
 
కరీంనగర్‌కు చెందిన అజీజ్ అనే వ్యక్తి క్షవరం చేసుకోవడం కోసం సెలూన్ షాపు వద్దకు వచ్చాడు. అతడు మాస్క్ ధరించక పోవడంతో అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ ధరించుకోమన్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అంతటితో ఆగకుండా అజీజ్ కత్తితో రాకేశ్ పైన దాడికి దిగి కత్తితో పొడిచాడు. దాంతో రాకేష్ అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. ప్రక్కనున్న స్థానికులు రాకేష్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments