Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ మీట్‌కెళ్లి అంటించుకున్నాడు.. ఇంటికొచ్చి 46 మందికి అంటించాడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (10:45 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి మర్కజ్ మత సమ్మేళనానికి వెళ్లి కరోనా వైరస్ బారినపడ్డాడు. అతను ఇంటికొచ్చి, ఆ కుటుంబంలోని 46 మందికి ఈ వైరస్ అంటించాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయడగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ మీట ద్వారా సంక్రమించినట్టు తేలింది. అందుకే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్టు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నారాయణగూడ పార్ధాగేట్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లారు. వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా, వారిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మిగిలిన ఐదుగురి పరీక్షా ఫలితాలు రావాల్సివుంది. 
 
అయితే, ఈ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబంలోని 46 మందితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ 46 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా, ఈ 46 మంది ఎవరినైనా కలిశారా లేదా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments