Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు - బిల్లు చెల్లించలేదనీ...

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (14:21 IST)
కరోనాకు వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయి. కరోనా వైరస్ రోగులు పొరపాటున చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినపక్షంలో వారిని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఓ సంఘటన ఒకటి వెలుగు చూసింది. కరోనా చికిత్స చేసిన తర్వాత బిల్లు చెల్లించలేదన్న కోపంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ఓ మహిళా వైద్యురాలిని గదిలో నిర్బంధించారు. ఈ దారుణాన్ని ఆమె ఓ సెల్ఫీ వీడియో ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో సుల్తానా అనే ఓ మహిళ డీఎంవోగా పని చేస్తూ వస్తోంది. ఈమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంది. అయితే, ఆస్పత్రి సిబ్బంది కేవలం 24 గంటలకు 1.15 లక్షల రూపాయల బిల్లు వేసి, అది కట్టాలని ఒత్తిడి తెచ్చారు. అంత బిల్లు ఎందుకు చెల్లించాలంటూ ఆ మహిళ నిలదీయడంతో ఆమెను ఓ గదిలో ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. 
 
తనను హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు కార్చుతూ తెలిపారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments