Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌లో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్

Webdunia
మంగళవారం, 26 మే 2020 (20:45 IST)
కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగునాట విస్తృతంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్..  తెలంగాణలోని బోధన్‌లో నిత్యావసరాలను పంపిణీ చేసింది. బోధన్ మునిసిపాలిటీలోని పేదలు లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని స్థానికులు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే దృష్టికి తీసుకువచ్చారు.
 
వెంటనే ఆయన స్పందించి బోధన్‌లో నిత్యావసరాలు పంపించేందుకు చర్యలు చేపట్టారు. నాట్స్  ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ నాయకులు కిశోర్ వీరగంధం, గోపి కృష్ణ పాతూరి, శశాంక్ కోనేరు తదితరుల సాయంతో బోధన్‌లో నిత్యావసరాలు పంపేందుకు కావాల్సిన సాయం చేశారు. దీంతో  బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్‌లోని 150 కుటుంబాలకు నిత్యావసరాలు అందించడం జరిగింది.
 
కరోనా కష్టకాలంలో మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసిన నాట్స్ నాయకులను స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తూమూ శరత్ రెడ్డి ప్రశంసించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్ముల అశోక్ రెడ్డి ,మున్సిపల్  కౌన్సిలర్ ధూప్ సింగ్, గుమ్ముల శంకర్ రెడ్డి ,సాయి రెడ్డి , శంకర్ రెడ్డి గుమ్ముల (డ్రెస్సెస్ ),ప్రకాష్ రెడ్డి ,శివకుమార్ ,విశాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments