Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా పాజిటివ్... 12 మంది ఖాకీలకు క్వారంటైన్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:43 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కరోనా వైరస్ సోకిన కానిస్టేబుల్‌తో సన్నిహితంగా ఉన్న 12 పోలీసులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. 
 
సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ విషయాలను పరిశీలిస్తే, హైదరాబాద్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ విధులను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, రెండు మూడు రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పితో పాటు.. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులను సంప్రదించారు. 
 
దీంతో ఆయన స్వాబ్‌తో పాటు రక్తాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించగా, ఇందులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా హెడ్ కానిస్టేబుల్‌తో ప్రైమరీ కాంటాక్ట్ అయిన 12 మంది పోలీస్ సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వారితో పాటు 10 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారన్‌టైన్ సెంటర్‌లో ఉంచారు. 
 
ప్రస్తుతం అందరికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా కొనిస్టేబుల్‌కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, మత ప్రార్థనల్లో పాల్గొనడం వల్ల ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా కానిస్టేబుల్ ఇంకా ఎవరెవరిని కలిసాడు అని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments