Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా పరీక్షలు... రిజల్ట్ ఏంటి?

Advertiesment
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈయన కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఓ వైద్యుడిని కలిశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రస్తుతం కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు ఇటీవల సొంతగా ఆస్పత్రిని నెలకొల్పారు. దీని ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఆ డాక్టర్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ వెళ్లారు. 
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆస్పత్రిని నెలకొల్పిన వైద్యుడు కరోనా లక్షణాలతో బాధపడుతుంటే కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షా ఫలితాలు వచ్చేంత వరకు అంటే 36 గంటల పాటు మంత్రి అనిల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే, ఈ ఫలితాల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటికే 300కు మించిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కుమార్ - కరోనా కుమారి జన్మించారు.. ఎక్కడ?