Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులు .. ఆ 2 జిల్లాల్లో నిల్

ఏపీలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులు .. ఆ 2 జిల్లాల్లో నిల్
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం ఉదయానికి మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 266కు చేరింది. 
 
ఈ కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖలో 5, అనంతపురం, కర్నూలులో మూడు చొప్పున, గుంటూరులో 2, వెస్ట్ గోదావరిలో ఒక కేసు చొప్పున నమోదైంది. ఈ వైరస్ బారినపడి ఇద్దరు చనిపోగా, ఐదుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూర్ 6, చిత్తూరు 17, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 32, కడప 23, కృష్ణ 28, కర్నూలు 56, నెల్లూరు 34, ప్రకాశం 23, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 16 చొప్పన నమోదు కాదు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపెడుతున్న కరోనా... ఎమర్జెన్సీ దిశగా జపాన్ అడుగులు