పేద ప్రజలకు కాంగ్రెస్ అండగా : ఎమ్మెల్యే సీతక్క

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:09 IST)
కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదని..నివారణ ఒక్కటే మార్గమని ప్రజలకు చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తాడ్వాయి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ…కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
ఈ సందర్భంగా కరోనాను అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ అంటువ్యాధి అని ఒకరి నుండి ఒకరికి అత్యంత తొందరగా చేరుకుంటుందని చెప్పారు.

దీన్ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండాలన్నారు.

ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్క్  పెట్టుకోవాలన్నారు . అలాగే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత శానిటైజర్ తోగానీ… సబ్బులతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు సీతక్క.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం