Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చిన కాంగ్రెస్

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:45 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం తేరుకోలేని షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎస్‌పీసీసీ)కి కొత్త నిర్వాహకులను తాజాగా ప్రకటించిది. ఇందులో కోమటిరెడ్డికి స్థానం కల్పించలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలే ఇందుకు కారణమై వుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
 
టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని, మాణిక్ ఠాగూర్ ఛైర్మన్‌గా పొలిటికల్ అఫైర్ కమిటీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండు కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. 
 
ఈయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఆ సమయంలో వెంకట్ రెడ్డి తన సోదరుడు విజయానికి పరోక్షంగా సహకరించారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. 
 
పైగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన ఏమాత్రం పొసగడంలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు పార్టీలో తారాస్థాయికి చేరాయి. వీటిపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన కమిటీలో వెంకట్ రెడ్డికి చోటు కల్పించలేదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments