Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం ఆంధ్రోళ్లమా.. తెలంగాణ అసెంబ్లీలో కడిగేసిన లేడీ టైగర్..!?

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (11:40 IST)
తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వాడి వేడి చర్చ జరిగింది. ఇటీవల తెలంగాణ సీఎం తన ఫామ్ హౌస్ సమీపంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అట్టహాసంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని గ్రామస్తులు గృహ ప్రవేశం చేసిన సంగతి మీడియా అంతా ధూంధాంగా చూపించారు. ఆ గ్రామస్తులు ఏకంగా కేసీఆర్ ఫోటోనే దేవుడి ఫోటోగా ఇళ్లలో పెట్టుకున్నారు. ఇక మీడియాలో ఈ గృహ ప్రవేశం కార్యక్రమం బ్రహ్మాండంగా హైలెట్ అయ్యింది.  
 
కానీ.. రాష్ట్రంలో కొన్ని లక్షల పేదలు ఉండగా.. కేవలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోనే పేదలు ఉన్నట్టు.. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించగానే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించినట్టు మీడియాలో ఫోకస్ కావడమే దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అసెంబ్లీలో నిలదీసింది. 
 
కేసీఆర్ నియోజకవర్గంలో, హరీశ్ రావు నియోజకవర్గాల్లో ఇళ్లుకడితే సరిపోయిందా అంటూ నిలదీసింది. మేం మీలాగే ప్రజలతో ఎన్నుకోబడలేదా.. మేం ఎమ్మెల్యేలం కామా.. మేమేమైనా ఆంధ్రోళ్లమా.. మా పల్లెల్లో డబుల్ బెడ్రూము ఇళ్లు వద్దా అంటూ డీకే అరుణ ప్రశ్నించింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments