Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ - గ్రామ అభివృద్ధిపై ఆరా

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (07:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న గ్రామ సర్పంచ్‌ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం అవసరమయ్యే నిధులు, దళితబంధు అమలు తదితరాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
అలాగే, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని ఆయన గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం కింద గ్రామంలో ఎంపికైన లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 
 
గ్రామంలో అర్హులైన అందరికీ దళితబంధు అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. వారంలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments