Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసాలమర్రి గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ - గ్రామ అభివృద్ధిపై ఆరా

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (07:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న గ్రామ సర్పంచ్‌ అంజయ్యకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకోసం అవసరమయ్యే నిధులు, దళితబంధు అమలు తదితరాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
అలాగే, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని ఆయన గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు పథకం కింద గ్రామంలో ఎంపికైన లబ్దిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 
 
గ్రామంలో అర్హులైన అందరికీ దళితబంధు అందేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. వారంలోగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments