Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తెలుగు మహాసభలు : గురువుకి కేసీఆర్ పాదాభివందనం

హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (20:48 IST)
హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. తర్వాత జాతీయ గీతాలాపనతో సభలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొన్నారు. 
 
సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులను వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌ మొదటగా తనకు విద్యనేర్పిన గురువు బ్రహ్మ శ్రీ మృత్యుంజయ శర్మకు తొలుత నుదుట కుంకుమ బొట్టు పెట్టి, ఆ తర్వాత శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అనంతరం ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు.
 
<iframe width="654" height="380" src="https://www.youtube.com/embed/HOrYNwgDaa8" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments