ఏపీ తీరు సక్రమంగా లేదు.. ప్రాజెక్టులు కట్టనివ్వం : సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సక్రమంగా లేదని, అందువల్ల ఆ రాష్ట్ర తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను కట్టనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నీటి కేటాయింపులు లేకుండానే, పర్యావరణ అనుమతులు రాకుండానే ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
ఏపీ తీరు అక్రమం అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు.
 
ఇక, జులై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి, జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి, ఇకపై 50:50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ మేరకు తెలంగాణ అజెండాను సిద్ధం చేసి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు పంపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు. కేంద్ర జలవనరుల శాఖామంత్రితో కూడా సమావేశం వినతిపత్రం సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments