Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కల్లో చికెన్ ధరలు ... మెట్రో నగరాల్లో కేజీ ధర రూ.250

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:39 IST)
దేశ వ్యాప్తంగా చిక్కెన్ ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో వీటి ధరలు మరింతగా మండిపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు చికెన్ అంటే భయపడిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. 
 
కరోనా వైరస్, బర్డ్ ఫ్లూ భయం కారణంగా చికెన్ ధరలు పాతాళానికి పడిపోయాయి. అలా నెల రోజులు పాటు కనిష్ట స్థాయికి పడిపోయిన చికెన్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఫలితంగా ఇపుడు చుక్కల్లో ఉంటున్నాయి. 
 
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్‌ రూ.220కి చేరింది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్‌ ముక్కలకు దూరమవుతున్నారు. ఆ డబ్బుతో కూరగాయలు కొనుక్కోవడానికే ఆసక్తి చూపుతున్నారు. 
 
కరోనా భయంతో నెల రోజుల క్రితం వంద రూపాయలకు మూడు కేజీల చికెన్ లభ్యమైంది. చెన్నై వంటి నగరాల్లో కేజీ చికెన్ కొంటే అర కేజీ చికెన్ ఫ్రీ అంటూ బోర్డులు కూడా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్లను ఉచితంగా కూడా ఇచ్చేశారు.
 
అయితే, గత కొన్ని రోజులుగా ఈ చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ ధరలు ఇదేవిధంగా ఉన్నాయి. చెన్నైలో కేజీ చికెన్ ధర రూ.240 పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. 
 
కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి  పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు చికెన్‌ తినాలని అనుకుంటున్నారు. అయితే, ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడు చికెన్‌ కొనలేకపోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments