Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లెక్కుతారు జాగ్రత్త!: ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (18:59 IST)
ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దేశమంతా ధాన్యం సేకరణ విధానం ఒకేలా వుండాల్సిన అవసరం వుందన్నారు. ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐకి సరైన విధానమంటూ లేదని మండిపడ్డారు. 
 
దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణలోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని కవిత హెచ్చరించారు. 
 
ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్‌సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల‌ నుంచి ఒక పద్దతి ‌లేకుండా ధాన్యాలను కొంటోందన్న ఎమ్మెల్సీ కవిత.. ప్రతి ఏడాది ఎఫ్‌సీఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదన్నారు ఎమ్మెల్సీ కవిత. రైతుల నుంచి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అంటూ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments