Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు - సీఆర్పీసీ 91 సెక్షన్ కింద..

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (14:52 IST)
భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు జారీచేశారు. ఈ దఫా సీఆర్పీసీ 160 కింద కాకుండా, సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు ఈ నోటీసు జారీ చేయడం గమనార్హం. 
 
సీఆర్పీసీ 160 కింద నోటీసు జారీచేస్తే విచారణ జరిపే వ్యక్తి ఇష్టానుసారం వారి నివాసంలోనే విచారణ జరుగుతుంది. అలాగే, కేవలం ఒక సాక్షిగా మాత్రమే ప్రశ్నిస్తారు. అదే సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేసి విచారణ అంటే మాత్రం మాత్రం సీబీఐ చెప్పిన చోటికి విచారణ ఎదుర్కొనే వ్యక్తి వెళ్ళాల్సి ఉంటుంది. అపుడు విచారణ మరింత లోతుగా జరుగుతుంది. 
 
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కె. కవితకు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె పాత్రపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ అధికారులు ఆమె వద్ద ఆదివారం ఏడున్నర గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమెను ఒక సాక్షిగా మాత్రమే పరిగణించి విచారించారు. సీబీఐ అధికారులు అనేక ఆధారాలు చూపించి కవిత వద్ద సమాధానాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో మరోమారు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
 
తాము చెప్పిన చోటికి విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. పైగా, తాము అడిగిన పత్రాలను విచారణకు తీసుకుని రావాలని కోరారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని, తాము అడిగిన పత్రాలను, సాక్ష్యాలను ఇవ్వాలని ఆదేశించారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని అందులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments