Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఉడత ఊపులకు భయపడం కేసీఆర్ : రేవంత్ రెడ్డి

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన

Webdunia
మంగళవారం, 8 మే 2018 (18:49 IST)
మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందున తనపై కక్ష సాధింపునకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శంచారు. 
 
కేంద్రంలో తొలుత సీబీఐ, ఈడీలను పంపి.... తరవాత మోడీ, అమిత్‌ షాలు రంగంలోకి దిగుతారని, అలాగే రాష్ట్రంలో తొలుత ఏసీబీని ఉసిగొలిపి తరవాత కేసీఆర్‌ రంగంలోకి దిగుతారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని విమర్శించారు.
 
మోడీ.. కేడీ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ' అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీ హబ్‌లో టెండర్లో అవినీతి జరిగింది అని కాగ్ నివేదిక ఇచ్చినా, నీ కుమారుడు నీతిమంతుడు అయితే ఎందుకు కేసును ఏసీబీకి అప్పగించవు. మోడీ తప్పులను ఎండగడుతున్న బాబుని నిలవరించే పనిలో భాగమే కేసీఆర్ సమీక్ష జరిగిందని అన్నారు. హత్యా రాజకీయాలు... ఉడుత ఊపులకు భయపడం అని తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments