Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఉడత ఊపులకు భయపడం కేసీఆర్ : రేవంత్ రెడ్డి

మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన

Webdunia
మంగళవారం, 8 మే 2018 (18:49 IST)
మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి చంద్రబాబుతో ఇబ్బంది, నాతో కేసీఆర్‌కు ఇబ్బంది అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందున తనపై కక్ష సాధింపునకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శంచారు. 
 
కేంద్రంలో తొలుత సీబీఐ, ఈడీలను పంపి.... తరవాత మోడీ, అమిత్‌ షాలు రంగంలోకి దిగుతారని, అలాగే రాష్ట్రంలో తొలుత ఏసీబీని ఉసిగొలిపి తరవాత కేసీఆర్‌ రంగంలోకి దిగుతారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్‌ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని విమర్శించారు.
 
మోడీ.. కేడీ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ' అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీ హబ్‌లో టెండర్లో అవినీతి జరిగింది అని కాగ్ నివేదిక ఇచ్చినా, నీ కుమారుడు నీతిమంతుడు అయితే ఎందుకు కేసును ఏసీబీకి అప్పగించవు. మోడీ తప్పులను ఎండగడుతున్న బాబుని నిలవరించే పనిలో భాగమే కేసీఆర్ సమీక్ష జరిగిందని అన్నారు. హత్యా రాజకీయాలు... ఉడుత ఊపులకు భయపడం అని తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments