19న హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:25 IST)
హైదరాబాద్‌ దుర్గంచెరువులో నిర్మితమైన కేబుల్‌ బ్రిడ్జి అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 19న దాని ప్రారంభోత్సవం జరుగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్‌ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇప్పటికే దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్‌మంటూ ఆకర్షించే రీతిలో విద్యుత్‌ కాంతులు అందరినీ కట్టి పడేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఐటి కారిడార్‌ను కేబుల్‌ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు.

233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‌మంటోంది. కేబుల్‌ బ్రిడ్జికి రెండువైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments