Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరు జిల్లాలో బస్సును ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. లారీ సృష్టించిన బీభత్సంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కాలేజీ విద్యార్థులు గాయపడ్డారు. 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ప్రతిభా జూనియర్‌ కళాశాలకు చెందిన బస్సు కొంతమంది విద్యార్థులతో కళాశాలకు వస్తోంది. ఈ  క్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఎదురుగా రహదారిపై మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.
 
అదేసమయంలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కళాశాల బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments