Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడికి పెళ్లి నిశ్చయమైందని అందరికీ చెప్పింది.. ఇంటికొచ్చి చూస్తే?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (15:46 IST)
కొడుకు పెళ్లి నిశ్చయం అయిందని అందరికీ చెప్పి ఇంటికి వచ్చిన తల్లికి ఆ కొడుకు కన్నీరు మిగిల్చాడు. ఇంట్లో జరిగిన ఘటన చూసి ఆమె హృదయం విలవిలలాడింది. సంతోషంగా నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో శవం కనిపించడం ఆమెను కలతకు గురిచేసింది. 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్‌కు చెందిన సాయమ్మ కొడుకు సంగమేష్‌కి గోపన్ పల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల ఎనిమిదవ తేదీన కొడుకుకి నిశ్చితార్థం చేయాలనుకుంది. ఎడవ తేదీ ఉదయం సాయమ్మ డ్యూటీకీ వెళ్లింది. అక్కడ అందరికీ తన కొడుకు నిశ్చితార్థం గురించి చెప్పి ఆహ్వానించింది. 
 
ఉదయం డ్యూటీకి వెళ్లిన ఆమె మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చింది. తలుపు ఎంత తట్టినా ఎవరూ తీయలేదు. లోపల నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. అనుమానం వచ్చిన సాయమ్మ కిటికీలోంచి చూసింది. పెళ్లి జరగవలసిన కొడుకు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. చిరతో ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని చనిపోయాడు. 
 
ఈ ఘటన చూసి ఆమె కన్నీరు మున్నీరు అయింది. ఆమె అరుపులు విని చుట్టుప్రక్కల వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి శవాన్ని క్రిందకు దించారు. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments