Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి వంచన: రైలుకు ఎదురెళ్లి టెక్కీ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:16 IST)
ప్రేమికుడు చేసిన మోసానికి మేడిపల్లిల ఓ లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలైపోయింది. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేయడంతో రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత, లాలాపేటకు చెందిన అజయ్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
వివాహం చేసుకుంటానని నమ్మబలికిన అజయ్‌ శ్వేతకు మరింత దగ్గరయ్యాడు. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టిన అజయ్‌ యువతిని వేధించసాగాడు. ఆ ఫొటోలు తొలగించేందుకు బ్లాక్‌మెయిల్‌ చేసాడు. ఫోటోలు సోషల్ మీడియాలో పెట్డడంతో వేదనకు గురైన శ్వేత రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
 
శ్వేత కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్వేత ప్రియుడు అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. గతంలో ఓసారి అజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments