Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులి వస్తోంది.. జింక పారిపోతోంది... బండి సంజయ్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (16:26 IST)
తెలంగాణ రాష్ట్రంతో పాటు.. తెలంగాణ సమాజం మార్పు కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందువల్ల తమ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. 
 
జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా కట్టడికి సీఎంవోలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలే పట్టించుకోవట్లేదని.. భాజపా కూడా పట్టించుకోదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి వస్తున్నారంటేనే సీఎం కేసీఆర్ నగరం విడిచిపోతున్నారన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పులి వస్తే జింక పారిపోయినట్లు కేసీఆర్‌ పారిపోతున్నారని విమర్శించారు. 
 
'జులై 3న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నాం. సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నాం. తెలంగాణలో పార్టీ పాలసీలను ప్రకటించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి సభ ఏర్పాటు చేస్తున్నాం. 10 లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు బూత్‌ నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు సమావేశాలు నిర్వహించాం. జన సమీకరణ కోసం కమిటీలు వేశాం. భాజపా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలిరావాలి' అని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments