Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మూడోకన్ను తెరిస్తే కేసీఆర్‌కు చిప్పకూడే : సోము బాబూరావు

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తెరాస పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడో కన్ను తెరిచారంటే సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెరాస టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. అవినీతి కార్యకలాపాలతో వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
 
పనిలోపనిగా ఎమ్మెల్యే జోగు రామన్నపైనా నిప్పులు చెరిగారు. జోగు రామన్న పెద్ద అవినీతిపరుడు అని, కోట్ల రూపాయల మేర అక్రమాలు చేశాడని అన్నారు. నన్ను ఏదో చేయాలని చూస్తే అడ్రస్ లేకుండా చేస్తా అని సోయం బాపూరావు హెచ్చరించారు. 
 
తాను నక్సల్స్ కే భయపడలేదని, జోగు రామన్న ఓ లెక్కా? అంటూ వ్యాఖ్యానించారు. నిజాలు మాట్లాడితే నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు... సోయం బాపూరావు దండు కదిలితే తట్టుకోలేరు అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments