Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసిన టీఎస్ బీజేపీ నేతలు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:01 IST)
తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. ఇటీవల తెరాస నేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా రామయ్య పేటకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్, అతని తల్లి ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. 
 
ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. 
 
పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసుల దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు గవర్నర్‌ను అభ్యర్థించారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారని బీజేపీ నేతలు తెలిపారు. కాగా, తెలంగాణాలో అధికార తెరాస, బీజేపీల మధ్య అన్ని విధాలుగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments