Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామస్థులు మాట్లాడటం లేదనీ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

Webdunia
గురువారం, 13 మే 2021 (09:41 IST)
కరోనా సోకిందన్న అనుమానంతో గ్రామస్థులంతా తనతో మాట్లాడకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 38 యేళ్ల ఓ వ్యక్తి భార్య, పదేళ్ల కుమారుడికి పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయనకు కూడా లక్షణాలు ఉండటంతో రెండుసార్లు పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే, గ్రామస్థులు మాత్రం.. ఆయనకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో స్థానికులు ఎవరూ మాట్లాడటం మానేశారు. మంగళవారం రాత్రి తీవ్రమైన దగ్గు, ఆయాసం రావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం తెల్లవారుజామున బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. 
 
వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments