గ్రామస్థులు మాట్లాడటం లేదనీ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

Webdunia
గురువారం, 13 మే 2021 (09:41 IST)
కరోనా సోకిందన్న అనుమానంతో గ్రామస్థులంతా తనతో మాట్లాడకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 38 యేళ్ల ఓ వ్యక్తి భార్య, పదేళ్ల కుమారుడికి పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయనకు కూడా లక్షణాలు ఉండటంతో రెండుసార్లు పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే, గ్రామస్థులు మాత్రం.. ఆయనకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో స్థానికులు ఎవరూ మాట్లాడటం మానేశారు. మంగళవారం రాత్రి తీవ్రమైన దగ్గు, ఆయాసం రావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం తెల్లవారుజామున బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. 
 
వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Venky: సూర్య తోపాటు అందరినీ మాయ చేసి వైల్ యానిమల్ తో వెంకీ అట్లూరి షూట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

Mrunal Thakur :అడివి శేష్ డెకాయిట్‌ లోని సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి రాబోతోంది

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments