Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారీ దవాఖానాలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (12:06 IST)
ఆమె జిల్లా ప్రథమ పౌరుడు (కలెక్టర్) సతీమణి. కానీ, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది మాత్రం ఓ ప్రభుత్వ దవాఖానాలో. ఈ అరుదైన దృశ్యం తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక జిల్లా కలెక్టర్ అంటే ఆషామాషీకాదు. సకల వసతులు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ ఆమె వాటిన్నింటిని కాదని సర్కారు దవాఖానలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీత్‌ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం మగశిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
గతంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ స్నేహలత జిల్లా ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే.జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ ఆమె సర్కారు దవాఖానలో గతనెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments