టీఆరెస్ ప్రభుత్వంలో ప్రతీ స్కీం వెనుక ఒక స్కాం

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (08:02 IST)
టీఆరెస్ ప్రభుత్వంలో ప్రతీ పథకం వెనుక ఏదో ఓ కుంభకోణం ఉంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఈఎస్ఐలో జరిగిన భారీ స్కాం విషయంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

హుజూర్నగర్లో భాజపా జెండా ఎగరేవేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతీ పథకం వెనుక ఒక స్కామ్‌ ఉందని ధ్వజమెత్తారు. ఈఎస్‌ఐలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మందులను అధికారులు ప్రభుత్వ పెద్దలు అడ్డంగా మింగేశారన్నారు. నిందితులను తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. నిజామాబాద్ రైతుల్లాగే హుజూర్నగర్‌ రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు నామినేషన్ వేయకుండా అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఖండించారు. అధికారుల అత్యుత్సాహాన్ని ఎన్నికల కమిషన్ ముందు పెడుతామన్నారు. హుజూర్నగర్లో భాజపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా అభ్యర్థిగా కోట రామరావు పేరును సిఫారసు చేశామని... రేపు నామినేషన్ దాఖలు చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments