Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ - హెడ్ ఆఫీసులోనే దీక్ష

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:14 IST)
తెలంగాణా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరుద్యోగ దీక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో టీబీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే దీక్షకు కూర్చొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో బండి సంజయ్ ఒక్క రోజు దీక్షకు పిలుపునిచ్చారు. 
 
అయితే, ఈ దీక్షపై పోలీసులు అనుమతి ఇవ్వలేదు కదా అనేక ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం అంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ ఆఫీసులోనే దీక్షకు కూర్చొన్నారు. అయితే,  ఈ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments