Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ - హెడ్ ఆఫీసులోనే దీక్ష

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:14 IST)
తెలంగాణా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరుద్యోగ దీక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో టీబీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే దీక్షకు కూర్చొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో బండి సంజయ్ ఒక్క రోజు దీక్షకు పిలుపునిచ్చారు. 
 
అయితే, ఈ దీక్షపై పోలీసులు అనుమతి ఇవ్వలేదు కదా అనేక ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం అంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ ఆఫీసులోనే దీక్షకు కూర్చొన్నారు. అయితే,  ఈ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments