Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ 21 ప్రశ్నలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (12:06 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా 21 ప్రశ్నలు సంధించారు. తెరాస 21వ ప్లీనరీ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో బండి సంజయ్ కూడా 21 ప్రశ్నలను సీఎం కేసీఆర్‌కు సంధించారు. ఈ ప్రశ్నలకైనా సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
గత 2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని ఎన్ని అమలు చేశారో చర్చించడానికి కేసీఆర్ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై కనీసం శ్వేతపత్రం అయినా విడుదల చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటి ధరలు ఎంత ఉన్నాయి.. తెలంగాణాలో ఎంత ఉన్నాయో ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని బండి సంజయ్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments