Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసర ట్రిపుల్ ఐటీలో మొబైల్‌ ఫోన్ వినియోగంపై నిషేధం

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (18:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో విద్యార్థులు చేసిన మెరుపు ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే.
 
దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనలో అనేకమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇది తీవ్రతరం కావడంతో తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆమె ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు తమ ఆందోళనను విరమించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ క్యాంపస్‍‌లో సెల్‌ఫోన్లు వినియోగించకుండా అధికారులు నిషేధం విధించారు. ట్రిపుల్ ఐటీలోని తరగతి గదులు, అకడమిక్ బ్లాక్, పరిపాలనా భవనాలలో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
మరోవైపు, మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని, డిమాండ్లన అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్స్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments