Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు పరిపాలనా రాజధాని ఖాయం : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టేలా లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్‌‌గా నియమితులైన తితిదే ఛైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి ఆదివారం వైకాపాకు చెందిన నేతలు, జీవీఎంసీ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. వైజాగ్ పరిపాలనా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని చెప్పారు. 
 
వీలైనంత త్వరలో న్యాయపరమైన సమస్యలు, చిక్కులు తొలగిపోయి విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. 
 
ఇకపోతే, ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన వరదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకే విపక్షాలు వరదలను తమ రాజకీయాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాయన్నారు. వరద బాధితులను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని, అనేక లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments