ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు. 
 
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. 
 
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

Kasarla Shyam: ఆయా షేర్ పాట తో లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారన్నారు : కాసర్ల శ్యామ్

Tammareddy: ఇండస్ట్రీ లో మనుగడ లేదు అనుకున్న టైంలో వదలా చిత్రం చేశా : తమ్మారెడ్డి

Sudigali Sudheer: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటోన్న సుడిగాలి సుధీర్ !

కె. దివ్యవాణి చౌదరి సారధ్యంలో బాపు బొమ్మ - విశ్వ మహిళ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కడుపులో మంటగా ఉందా?

షార్లెట్‌లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments