Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు. 
 
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. 
 
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments