Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కావాలనే ఆ పని చేయిస్తోంది.. అసదుద్ధీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (20:19 IST)
భారత్‌లో ముస్లింల పట్ల ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకటనను భారత్ ఖండించిన విషయంపై అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. 
 
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓఐసీ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల ముస్లింల ఆందోళన గురించి మాత్రం ఎందుకు స్పందించలేదని అసదుద్దీన్ నిలదీశారు.
 
అరబ్ ప్రపంచం ముందు భారత్ అపఖ్యాతి పాలైంది. భారత విదేశాంగ విధానం నాశనమైంది. నుపూర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. బీజేపీ కేవలం సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదని తెలిపారు. 
 
అలాగే, భారత విదేశాంగ శాఖ ఏమైనా బీజేపీలో భాగమైపోయి పనిచేస్తుందా? ఒకవేళ గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చెలరేగితే ఏం చేస్తారు? బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తుందని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వస్తేనే తమ నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుందని అసదుద్దీన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments