Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కావాలనే ఆ పని చేయిస్తోంది.. అసదుద్ధీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (20:19 IST)
భారత్‌లో ముస్లింల పట్ల ప్రదర్శిస్తోన్న వైఖరి సరికాదంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకటనను భారత్ ఖండించిన విషయంపై అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. 
 
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓఐసీ చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల ముస్లింల ఆందోళన గురించి మాత్రం ఎందుకు స్పందించలేదని అసదుద్దీన్ నిలదీశారు.
 
అరబ్ ప్రపంచం ముందు భారత్ అపఖ్యాతి పాలైంది. భారత విదేశాంగ విధానం నాశనమైంది. నుపూర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. బీజేపీ కేవలం సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదని తెలిపారు. 
 
అలాగే, భారత విదేశాంగ శాఖ ఏమైనా బీజేపీలో భాగమైపోయి పనిచేస్తుందా? ఒకవేళ గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చెలరేగితే ఏం చేస్తారు? బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తమ నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తుందని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వస్తేనే తమ నేతలపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుందని అసదుద్దీన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments