Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ ఇష్యూ..పాక్‌కు ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ అమ్మాయి ప్రధాని అవుతుంది..?

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (19:13 IST)
హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్ ధరించి విద్యార్ధినిలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లకూడాదా? అని ప్రశ్నించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈరోజు హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదోక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది"అని అన్నారు.
 
"హిజాబ్, నిఖాబ్‌ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు అవుతారు. న్యాయమూర్తులు అవుతారు.డాక్టర్లు,వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తారని ఓవైసీ వెల్లడించారు. 
 
ఇంకా ఓవైసీ మాట్లాడుతూ.. "హిజాబ్‌ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది.. కావాలంటే నేను చెప్పింది రాసి పెట్టుకోండి. ఇది చూడటానికి నేను జీవించి ఉండకపోవచ్చు.. కానీ ఏదోక రోజు ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది" అని అన్నారు.
 
హిజాబ్ వివాదంపై పాక్ మంత్రులు విమర్శలకు "ఇది మా దేశం అంతర్గత సమస్య మేం చూసుకుంటాం..మీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. బాలికా విద్య కోసం పోరాడే మలాలా యూసఫ్ జాయ్పై తాలిబన్లు దాడి చేసింది పాకిస్థాన్‌లోనే కదా.. అటువంటి మీరు మాకు నీతులు చెప్పనక్కరలేదు" అని పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఓవైసీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments