Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే మా మద్దతు : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (16:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ భారసా అధినేత, సీఎం కేసీఆర్‌కే మద్దతు ఇస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల కేసీఆర్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్లకాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.
 
తెలంగాణాలో బీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య దోస్తీ మొదటి నుంచి కొనసాగుతుందన్నారు. మస్జిల్ తమ మిత్రపక్షమని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అసదుద్దీన్ ఇటీవల కూడా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని అన్నారు. తాము తెలంగాణాలో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments