Publish Date: Sat, 14 Oct 2023 (21:39 IST)
Updated Date: Sat, 14 Oct 2023 (21:44 IST)
తెలంగాణలో దసరా పండుగ అంటేనే సందడిగా వుంటుంది. అయితే పండుగ రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి. మటన్ రేటు రూ. 800 దాటింది. ఇక మద్యం రేటు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బంపర్ ఆఫర్ ఎన్నికల రూపంలో వచ్చి పడింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం బాట పట్టాయి. హుజురాబాద్ మునుగోడు తర్వాత ఓటర్లలో కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.
ఇక అభ్యర్థులకు దసరా టెండర్ పెట్టారు ఓటర్లు. ప్రతి ఇంటికి మటన్ పంచేలా కొంతమంది అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక వీటితో పాటు మద్యం విచ్చలవిడిగా పంచేందుకు అభ్యర్థులందరూ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు.
ఇంకొంతమంది బతుకమ్మ పండుగకు మహిళల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా, ఎన్నికల కమిషన్ డేగ కళ్ళతో చూసినా.. దీన్ని ఎవరూ ఆపలేరని భావిస్తున్నారు.