Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో నా కొడుకు చనిపోయినప్పుడు సూసైడ్ చేసుకుందామనుకున్నా... బాబూ మోహన్

తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:54 IST)
తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్ బైకులు కూడా వుంటున్నాయి. ఇలాంటి వాహనాలతోనే కొందరు పిల్లలు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 
 
గతంలో కోట శ్రీనివాస రావు కుమారుడు, హాస్య నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ కుమారుడు ఇలా అతివేగంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు కూడా అత్యంత వేగంతో కారును నడిపి ప్రాణాలు కోల్పోయారు. తండ్రి బిడ్డను కోల్పోతే అనుభవించే నరకం ఎలాంటిదో బాబూ మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాననీ, ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిననీ, ఆ సమయంలో ఈవీవి సత్యనారాయణ తన మనసు మార్చి ఓదార్చారన్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఎవడిగోల వాడిది చిత్రం కోసం అక్కడికి తీసుకెళ్లి తనకు మనశ్శాంతి కల్గించాడనీ, ఆ రోజు ఇవివి సత్యనారాయణ అలా చేయకపోతే తను వుండేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments