Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది... ఎంపీ ధర్మపురి అరవింద్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (14:40 IST)
తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనై హైదరాబాద్ బంజార హిల్స్‌లోని న్యూరో సిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షలను చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక మీడియా బులిటెన్ విడుదల చేయనున్నారు. 
 
దీనిపై ధర్మపురి అరవింద్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. అందువల్ల ఈ రోజు రేపు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments