Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ నడపడంలో పోటీపడుతున్న అన్నా చెల్లి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (12:52 IST)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్. షర్మిళలు ఇపుడు ట్రాక్టర్లు నడపడంలో పోటీ పడుతున్నారు. ఇటీవల వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపారు. ఇపుడు ఆయన చెల్లి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిళ కూడా ట్రాక్టర్ నడిపారు. ప్రస్తుతం ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఆమె సాగిస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా గన్నవరం గ్రామంలో ఆమె తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు తలపాగా చుట్టి ట్రాక్టర్ నడిపారు. గన్నవరం నుంచి ఖానాపూర్ గ్రామం వరకు ఆమె ట్రాక్టర్ నడిపి అభిమానులను, రైతులను ఆనందపరిచారు. ఇపుడు షర్మిల ట్రాక్టర్ నడిపిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments