తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (06:48 IST)
రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించదని తెలిపారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నంకాని, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధికాని కనిపించలేదని స్పష్టం చేశారు.

రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని రేవంత్​ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదని అన్నారు.

ఇప్పటికే హద్దుదాటి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని సమాజం భరించిందని... ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Venky: సూర్య తోపాటు అందరినీ మాయ చేసి వైల్ యానిమల్ తో వెంకీ అట్లూరి షూట్

Rowdy Janardhana: రౌడీ జనార్దన షూట్ లో ఆసక్తికర అంశాన్ని వెల్లడించిన రవి కిరణ్ కోల

Mrunal Thakur :అడివి శేష్ డెకాయిట్‌ లోని సెకండ్ సింగిల్ చిచ్చుబుడ్డి రాబోతోంది

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments