Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వైతాళికులను నిర్లక్ష్యం చేసిన ఆంధ్ర పాలకులు: మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:41 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తుల జయంతి ఉత్సవాలను తగిన రీతిలో నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి రామారావు అన్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహరావుతో సహా పలువురు తెలంగాణ ప్రముఖ వ్యక్తులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గౌరవించలేదని వారిని విస్మరించారని తెలిపారు.
 
భారత మాజీ ప్రధాని పి.వి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవికి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. కేంద్ర ప్రభుత్వం పీవికి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. పీవి ఒక్కరే కాదు తెలంగాణకు చెందిన ఎంతోమంది వైతాళికులను మరిచిపోయారని, వారి ఉనికి మరుగునపడిందని తెలిపారు. వారిని గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
 
పీ.వి నరసింహరావు అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. భూ సంస్కరణలు మొదలు పెట్టిన పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పినా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పివి అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు పురస్కారాలు తెచ్చిపెట్టిందన్నారు.
 
రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కొమరయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ వంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుందన్నారు. వీరి స్పూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments