Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వైతాళికులను నిర్లక్ష్యం చేసిన ఆంధ్ర పాలకులు: మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:41 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తుల జయంతి ఉత్సవాలను తగిన రీతిలో నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి రామారావు అన్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహరావుతో సహా పలువురు తెలంగాణ ప్రముఖ వ్యక్తులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గౌరవించలేదని వారిని విస్మరించారని తెలిపారు.
 
భారత మాజీ ప్రధాని పి.వి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవికి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. కేంద్ర ప్రభుత్వం పీవికి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. పీవి ఒక్కరే కాదు తెలంగాణకు చెందిన ఎంతోమంది వైతాళికులను మరిచిపోయారని, వారి ఉనికి మరుగునపడిందని తెలిపారు. వారిని గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
 
పీ.వి నరసింహరావు అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. భూ సంస్కరణలు మొదలు పెట్టిన పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పినా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పివి అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు పురస్కారాలు తెచ్చిపెట్టిందన్నారు.
 
రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కొమరయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ వంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుందన్నారు. వీరి స్పూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments