తల్లీకూతుళ్లను బలి తీసుకున్న అక్రమ సంబంధం

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:39 IST)
నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో ఓ అక్రమ సంబంధం తల్లీకూతుళ్లను బలి తీసుకుంది. అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు(46)కు 1996లో రేగోడు మండలం చౌదర్‌పల్లికి చెందిన అనసూయ(40)తో వివాహం జరిగింది.

గతంలో భార్యపై అనుమానంతో.. ఈ విషయాన్ని సాయిలు అనసూయ తల్లి విఠమ్మకు చెప్పాడు.. ఈ సమయంలో అత్తకు, అల్లుడికి గొడవ జరిగింది. ఆ సమయంలో రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీ కాలనీలో నివాసం ఉండే విఠమ్మను సాయిలు తన సోదరుడు రాములుతో కలిసి దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో అప్పట్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. కొంతకాలం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా పెద్దల మధ్యవర్తిత్వంతో తిరిగి కాపురం సజావుగా సాగుతున్నప్పటికీ అనసూయపై అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో అనసూయ కొన్నాళ్లపాటు భర్త నుంచి వేరుగా ఉంది.

నెల రోజుల కిందట పెద్దలతో రాజీ ప్రయత్నంతో సాయిలు ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్యచేసి ఠాణాలో లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి స్కూటీ, హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకుని జహీరాబాద్‌ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై సందీప్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments