Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీకూతుళ్లను బలి తీసుకున్న అక్రమ సంబంధం

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (13:39 IST)
నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో ఓ అక్రమ సంబంధం తల్లీకూతుళ్లను బలి తీసుకుంది. అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు(46)కు 1996లో రేగోడు మండలం చౌదర్‌పల్లికి చెందిన అనసూయ(40)తో వివాహం జరిగింది.

గతంలో భార్యపై అనుమానంతో.. ఈ విషయాన్ని సాయిలు అనసూయ తల్లి విఠమ్మకు చెప్పాడు.. ఈ సమయంలో అత్తకు, అల్లుడికి గొడవ జరిగింది. ఆ సమయంలో రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ ఎంఐజీ కాలనీలో నివాసం ఉండే విఠమ్మను సాయిలు తన సోదరుడు రాములుతో కలిసి దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో అప్పట్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. కొంతకాలం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా పెద్దల మధ్యవర్తిత్వంతో తిరిగి కాపురం సజావుగా సాగుతున్నప్పటికీ అనసూయపై అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో అనసూయ కొన్నాళ్లపాటు భర్త నుంచి వేరుగా ఉంది.

నెల రోజుల కిందట పెద్దలతో రాజీ ప్రయత్నంతో సాయిలు ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించి బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్యచేసి ఠాణాలో లొంగిపోయాడు. నిందితుడిని అరెస్టు చేసి స్కూటీ, హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకుని జహీరాబాద్‌ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై సందీప్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments