Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు చెప్పకుండా కేసీఆర్‌ను ఎలా కలుస్తారు? అమిత్ షా ఆగ్రహం!

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:13 IST)
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్‌ ఎన్నిక జరగాల్సివుంది. దీన్ని ఏకగ్రీవం చేసే విషయమై మాట్లాడేందుకు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వద్దకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప‌లువురు బీజేపీ సీనియర్ నేతలు వెళ్లారు. అయితే, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్‌లో తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. 
 
ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్రం హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. కేటీఆర్‌ను క‌లిసి వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కేటీఆర్‌ను బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డంపై నిజనిర్ధారణ క‌మిటీ వేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఆదేశించింది. 
 
కేటీఆర్‌ను క‌లిసిన స‌మ‌యంలో బండి సంజయ్‌పై స‌ద‌రు మంత్రి ప‌లు కామెంట్లు చేసినా బీజేపీ నేత‌లు ఎందుకు ఉపేక్షించారన్న విష‌యంపై కూడా నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఆరా తీయ‌నుంది. క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని బండి సంజ‌య్‌కు అధిష్టానం నుంచి ఆదేశాలు రావ‌డంతో మంగళవారం ఆయ‌న దాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో తనకు రిపోర్ట్‌ ఇవ్వాలని కమిటీని బండి సంజయ్‌ ఆదేశించారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఏమి జరిగిందనే విష‌యంపై ఈ త్రిసభ్య కమిటీ తేల్చనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments