Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్... తెలంగాణ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (14:12 IST)
అమెరికా దేశంలో జరిగిన ఓ విషాదకర ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ప్రాణాలు విడిచారు. 
 
ఈ జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అలాగే, తన ప్యాకెట్ మనీ కోసం సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయింది. అందులోని బుల్లెట్ ఒకటి బయటకు దూసుకొచ్చి అఖిల్‌ సాయి తలలోకి దూసుకెళ్లింది. 
 
దీంతో ఇతర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్‌ మృతిచెందాడు. అఖిల్‌ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments