Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్‌గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్‌గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది.  
 
ఈ నేపథ్యంలో వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 
 
ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకుండా... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. 
 
ఛంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్ కుమార్ తో పాటు హైదరాబాద్ జిల్లా భూ పరిరక్షణ ఎన్డీసీగా జీ. సంతోషినిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments