Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన గాఢ నిద్రలో వున్నాడు.. చంపేద్దాం రా... ప్రియుడితో కలిసి...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (21:31 IST)
అక్రమ సంబంధాలు అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఒక మహిళ తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ నిజం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే బాబాఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భార్య జహీదాతో కలిసి నివాసం ఉంటున్నాడు. 
 
కొంతకాలంగా అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి భర్త అడ్డు వస్తుండటంతో అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది. బాబాఖాన్ తన ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో మా ఆయన నిద్రమత్తులో వున్నాడు.. వచ్చేయ్ చంపేద్దువుగాని అని ప్రియుడిని అతని స్నేహితులను పిలిపించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. 
 
చట్టానికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఏమీ ఎరగనట్లు అంత్యక్రియలు కూడా జరిపించింది. మృతుని మరణం పట్ల మరియు ఆమె ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శవాన్ని తిరిగి వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు తేలింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని జహీదాను విచారించారు. దాంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే ప్రియుడితో కలిసి ఒంటి గంట సమయంలో హత్య చేయించానని వెల్లడించింది. ఈ దారుణంలో పాలుపంచుకున్న ఆమెను, ప్రియుడిని వారితోపాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments