Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన గాఢ నిద్రలో వున్నాడు.. చంపేద్దాం రా... ప్రియుడితో కలిసి...

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (21:31 IST)
అక్రమ సంబంధాలు అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఒక మహిళ తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించి అంత్యక్రియలు కూడా జరిపించింది. కానీ నిజం ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే బాబాఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో భార్య జహీదాతో కలిసి నివాసం ఉంటున్నాడు. 
 
కొంతకాలంగా అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి భర్త అడ్డు వస్తుండటంతో అతడిని హతమార్చాలని పన్నాగం పన్నింది. బాబాఖాన్ తన ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో మా ఆయన నిద్రమత్తులో వున్నాడు.. వచ్చేయ్ చంపేద్దువుగాని అని ప్రియుడిని అతని స్నేహితులను పిలిపించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. 
 
చట్టానికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఏమీ ఎరగనట్లు అంత్యక్రియలు కూడా జరిపించింది. మృతుని మరణం పట్ల మరియు ఆమె ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శవాన్ని తిరిగి వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు తేలింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని జహీదాను విచారించారు. దాంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడనే ప్రియుడితో కలిసి ఒంటి గంట సమయంలో హత్య చేయించానని వెల్లడించింది. ఈ దారుణంలో పాలుపంచుకున్న ఆమెను, ప్రియుడిని వారితోపాటు మరో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments