Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:56 IST)
సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు హాజరుకానున్నారు. గత 2009 సంవత్సరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 
 
ఇపుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే, బీజేపీలో చేరే జయసుధ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ముషిరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు పార్టీ నాయకత్వం టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments